గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) కు బిగ్ షాక్ తగిలింది. గతంలో వివిధ కేసుల్లో జైలు జీవితం గడిపి విడుదలైన ఆయనపై మరోసారి కేసు నమోదైంది.
విజయవాడ పోలీసులు వైసీపీ నేతపై ఈ కొత్త కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. వంశీ తో పాటు మరో ఎనిమిది మందిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా వంశీ వరుస వివాదాలు, కేసులను ఎదుర్కొంటున్న తరుణంలో, తాజా ఫిర్యాదు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంతో ఈ కేసులో వంశీని మరోసారి జైలుకు తరలిస్తారా లేదా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు.
