Showing posts with label CRIME. Show all posts
Showing posts with label CRIME. Show all posts

విజయవాడలో మహా దారుణం !!

 విజయవాడ నగరంలోని చిట్టినగర్ ప్రాంతంలో పది రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ చివరికి దారుణ హత్యగా దారితీయడం కలకలం సృష్టిస్తోంది. మద్యం కోసం రూ.10 ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు మరొక వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఏ వ్యవహారం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.


అసలేం జరిగిందంటే..

స్థానిక భీమన బాపయ్యవీధి కొండ ప్రాంతంలో తెన్నేరు పాండు జ్యోతి కుమారుడు.. 19 ఏళ్ల దుర్గాప్రసాద్ ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రోజున ఇంట్లో అన్నయ్య సిగరెట్ తాగుతుండగా దుర్గాప్రసాద్ అతడిని మందలించాడు. ఈ విషయంపై కుటుంబంలో వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్గాప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లి చిట్టినగర్‌లోని ఓ బార్‌లో మద్యం సేవించాడు.

రూ.10 అడిగినందుకు చెంపదెబ్బ..


మరోసారి మద్యం తాగాలనే ఉద్దేశంతో దుర్గాప్రసాద్‌కు రూ.10 అవసరమైంది. ఈ క్రమంలో చిట్టినగర్‌కు చెందిన 48 ఏళ్ల పలకా తాతాజీని డబ్బు అడిగాడు. అయితే తాతాజీ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, దుర్గాప్రసాద్ చెంపపై కొట్టాడు. ఈ ఘటనతో యువకుడు తీవ్రంగా కోపగించాడు. దీంతో వెంటనే వేరొకరి వద్ద నుంచి డబ్బు తీసుకుని మళ్లీ మద్యం సేవించాడు. ఆపై ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని.. అర్ధరాత్రి సమయంలో చిట్టినగర్ సొరంగ మార్గంలోని షాపు వరండాలో నిద్రిస్తున్న తాతాజీ వద్దకు వెళ్లాడు. నిద్రలో ఉన్న తాతాజీ ఛాతీలో కత్తితో పొడిచి హత్య చేశాడు. సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు.

నవదంపతుల మృతిలో షాకింగ్ వీడియో..రైలులో గొడవ

వంగపల్లి వద్ద మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో పడి మృతి చెందిన నవదంపతుల కేసులో షాకింగ్ వీడియో బయటపడింది. ప్రమాదానికి ముందు వారు రైలులో గొడవ పడిన దృశ్యాలు ఇప్పుడు అనుమానాలకు తావిస్తున్నాయి.

విధాత: వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి కోరాడ సింహాచలం (25), భవాని (19) అనే నవ దంపతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే వారి మరణానికి ముందు రైలులో దంపతులు ఇద్దరు గొడవ పడినట్లుగా ఓ వీడియో వెలుగులోకి రావడంతో ఈ సంఘటన మరో మలుపు తీసుకుంది. గొడవ నేపథ్యంలోనే రైలు ప్రమాదం జరిగిందా? లేక ఆత్మహత్యనా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అంతకుముందు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. సింహాచలం హైదరాబాద్‌లో ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తుండగా జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత డోర్‌ వద్ద నిలబడి ఉన్న ఇద్దరూ జారిపడి మృతిచెందారు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్‌ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రైల్వే జీఆర్పీ ఇన్‌ఛార్జి కృష్ణారావు తెలిపారు. ఇప్పుడు నవదంపతులు ఇద్దరు చనిపోవడానికి ముందు రైలులో గొడవ పడిన వీడియో వెలుగు చూడటంతో కేసు కొత్త మలుపు తీసుకుంది.

Guntur: బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి, అసభ్యకర ఫొటోలు తీసి..

 Guntur: బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి, అసభ్యకర ఫొటోలు తీసి..

Guntur girl drugs


ఇన్‌స్టా పరిచయాలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఎందరో ప్రాణాలు తీసుకోగా, మరెన్నో కుటుంబాల్లో అల్లకల్లోలానికి దారితీస్తున్నది. ఇక్కడా ఆ కుటుంబాన్ని అగాథంలోకి నెట్టివేసింది.

తేరుకుంటుందో, మరేదైనా ప్రమాదం చోటుచేసుకుంటుందో తెలియని అయోమయ పరిస్థితి ఆ కుటుంబంలో నెలకొన్నది. ఇలాంటి పరిస్థితి మరో కుటుంబంలో జరగకూడదని పలువురు మానసిక విశ్లేషకులు కోరుకుంటున్నారు.


Guntur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పట్టణంలోని ఓ కళాశాలలో ఓ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. అదే కళాశాలలో చదివే ఓ సీనియర్ విద్యార్థి ఆమెకు ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ ఆ యువకుడు నమ్మించాడు. ఈ సమయంలో ఆమెకు తెలియకుండానే ఆమెకు డ్రగ్స్ అలవాటు చేశాడు. ఈ సందర్భంగా ఆమెతో అసభ్యంగా తాను ప్రవర్తించి వీడియోలు తీసుకున్నాడు.


Guntur: ఆ బాలిక కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆమె ఫోన్‌ను పరిశీలించగా నిర్ఘాంతపోయారు. కళ్లు బైర్లు కమ్మేసినంత పనైంది. ఓ యువకుడితో తన కూతురు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను చూసి తల్లి మందిలించింది. దీనికి ప్రతిగా తల్లిపైనే ఆ బాలిక దాడి చేసింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించసాగింది.


Guntur: ఎటూ తోయని ఆ మాతృమూర్తి మనస్తాపానికి గురైంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. డ్రగ్స్ కోణంలో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును డ్రగ్స్ ముగ్గులోకి దించి, అసభ్య వీడియోలు, ఫొటోలు తీసి అల్లరి చేసిన ఆ దుండగుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆ కుటుంబంతోపాటు స్థానికులు కోరుతున్నారు.

విజయవాడలో మహా దారుణం !!

 విజయవాడ నగరంలోని చిట్టినగర్ ప్రాంతంలో పది రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ చివరికి దారుణ హత్యగా దారితీయడం కలకలం సృష్టిస్తోంది. మద్యం కోసం రూ.1...